రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మంత్రి రవీంద్ర చౌబే ప్రకటించారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.
ఛత్తీస్గఢ్లో గత రెండు రోజులుగా గరిష్ఠంగా వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,880కి చేరింది. తాజాగా ఇద్దరు కరోనా వల్ల మరణించడంతో మృతుల సంఖ్య 3,929కి పెరిగింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో తదుపరి ఆదేశాల వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మంత్రి రవీంద్ర చౌబే ఆదివారం వెల్లడించారు.