బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి కేరళ సీఎం పినరయి విజయన్కు సోమవారం ఒక లేఖ రాశారు, కాసరాగోడ్ జిల్లాలోని మంజేశ్వర్లో కన్నడ పేర్లు ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడంపై అభ్యతరం వ్యక్తం చేశారు. “భాషా సామరస్యం, సాంస్కృతిక సహజీవనం పేరిట” పేరు మార్చే ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. పదేండ్లుగా కాసరాగోడ్ కేరళలో భాగం అయినప్పటికీ కర్ణాటకతో చాలా అనుబంధం ఉన్నదని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలు ఇరు భాషల సంస్కృతికి అలవాటు పడ్డారని, ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు.