హైదరాబాద్ : దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. గంగా జమునా తెహజీబ్కు వారధి కట్టిన అక్షర సారథి దాశరథి అని సీఎం అన్నారు. దాశరథి స్ఫూర్తితో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చెందుతోందన్నారు. దాశరథి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. దాశరథి సాహితీ పురస్కారంతో సాహితీ మూర్తులకు సత్కారం నిర్వహిస్తున్నట్లు సీఎం చెప్పారు.
2021 సంవత్సరానికిగాను దాశరథి కృష్ణమాచార్య అవార్డు తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డిని వరించింది. దాశరథి జయంతి(జులై 22) సందర్భంగా ఎల్లూరి శివారెడ్డికి గురువారం అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు రూ. 1,01,116 నగదును ప్రోత్సాహకంగా అందజేయనున్నారు.