నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. మెట్పల్లి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి మార్గమధ్యలో వేల్పూర్లో ఆగారు. సురేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి.