బెంగళూరు : కొవిడ్-19 టీకాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. విషయంలేని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, పిటిషన్దారుకు రూ.50 వేల జరిమానా విధించింది. నెల రోజుల్లోపుగా ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమచేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం లోపభూయిష్టంగా ఉంటున్నందున వెంటనే టీకాలు వేయడాన్ని నిలుపుదల చేయాలని ముగ్గురు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం బుధవారం విచారించింది. “వ్యాక్సిన్లను ఆపడానికి ఈ పిటిషన్ వేయబడిన మాట వాస్తవం. అయితే, ఈ పిటిషన్ ప్రజా ప్రయోజనాల కోసం దాఖలు చేయబడలేదని సూచిస్తున్నది. అందువల్ల కోర్టు ఇతర విజ్ఞప్తులకు వెళ్లవలసిన వెళ్ళవలసిన అవసరం లేదు” అని కోర్టు అభిప్రాయపడింది.
మొదటి పిటిషనర్ ఆర్మీ ఆఫీసర్ అయినందున, 2, 3 వ పిటిషనర్లపై మాత్రమే ఖర్చులు విధించాలని హైకోర్టు ప్రతిపాదించింది. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు వారికి రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు సీఎం రిలీఫ్ ఫండ్కు జమచేయాలని ఇద్దరు పిటిషనర్లను ఆదేశించింది.
భారత్లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
పాకిస్తాన్తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్
మధ్యప్రదేశ్లో పీపీఈ కిట్ల కుంభకోణం..
ఇక ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా భర్తీ చేయాల్సిందే..!
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..