సూర్యాపేట: జిల్లాలోని మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..