మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 29: మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎదిరలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు (2016 బ్యాచ్ ) పరీక్షలు ప్రారంభమయ్యాయి. థియరీ పరీక్షలు ముగియడంతో గురువారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభించారు. 150మంది వైద్యవిద్యార్థులకు పరీక్షలు పారదర్శకంగా చేపట్టారు. డైరెక్టర్ డా.పుట్టా శ్రీనివాస్ పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు ఈనెల 4వరకు జరుగనున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించారు.