సుమారు నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి సీఎం కేసీఆర్ సభ పతాక సన్నివేశం. టీఆర్ఎస్ అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నది. చెప్పుకొనేందుకు ఏమీలేక టీఆర్ఎస్ను అడ్డుకునే కుట్రలు చేసింది. వీటిని తిప్పి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి సాగర్ ప్రజలు జై కొడుతున్న తీరుతో ఓటమి ఖాయమని భావించే ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడంతో ప్రజలు.. కేసీఆర్ పాలననే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలి.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి