హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయుగుండం తీవ్రమై సోమవారం ఉదయం తుఫానుగా మారింది. బుధవారం ఒడిశాలోని బాలాసోర్లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రభావంతో తెలంగాణలోని ఒకటి రెండు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దక్షిణ, తూర్పు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.