హైదరాబాద్ : తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామరెడ్డి(85) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వ్యవసాయం, రైతు సమస్యలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించిన రైతుకవి వెలపాటి అని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వస్తువును కవితాంశంగా చేసుకొని రచనా వ్యాసాంగాన్ని సాగించిన వెలపాటి మరణంతో, తెలంగాణ ఒక ఉత్తమ సాహితీవేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. రామరెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కవి, సాహితీవేత్తగా వేలపాటి రాంరెడ్డి ఎన్నో రచనలు చేశారు. సాహితీవేత్తగా, కవిగా తెలుగు భాషలో పలు రచనలు చేసినందుకుగాను 2017 సంవత్సరంలో రాష్ట్ర అవిర్భావం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని అందించి గౌరవించింది.