తరతరాలుగా మట్టిపొరకింద పడి ఉన్న విత్తనానికి తడి వాసన తగులుతున్నది. మొలకెత్తి మహా వృక్షంగా ఎదగాలన్న ఎడతెగని ఆశకు జీవధార తోడుకానున్నది. అణచివేత అవరోధాలను ఛేదించి సమాజ ప్రగతికి దళిత జాతి పాదుకలు తొడుగుతున్నది. ప్రభుత్వ విప్లవాత్మక కృషిని అనంత విజయంగా మార్చే సంకల్పానికి నేడు తొలి అడుగు పడుతున్నది. రాష్ట్రంలోని దళితజాతి ఉద్ధరణే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా సోమవారం లాంఛనంగా ప్రారంభిం చనున్నారు. హుజూరాబాద్లో సీఎం సభ లైవ్ ప్రసారం…