హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికే పట్టభద్రులు పట్టం కట్టారని బహ్రెయిన్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం పట్ల ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తంచేస్తున్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. ఈ ఎన్నికల ద్వారా ఓటర్లు జాతీయ పార్టీలకు గుణపాఠం చెప్పారన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.