మంత్రి హరీశ్రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో భేటీ
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావే తమ నాయకుడని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు స్పష్టంచేశారు. శనివారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కమలాపూర్ నాయకులు సమావేశమయ్యారు. కమలాపూ ర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్ పేరాల సంపత్రావు, కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ పీ కృష్ణప్రసాద్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమారస్వామి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా అది టీఆర్ఎస్తోనే సాధ్యమని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న తమకు అధినేత కేసీఆర్ మాటే శిరోధార్యమని స్పష్టంచేశారు.