ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి ఆహ్వానం పలికారు. మంగళవారం ప్రగతిభవన్లో కేసీఆర్కు ఆహ్వానపత్రిక అందజేశారు. ఆలయ వేద పండితులు.. సీఎంకుఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్, పాలక మండలి సభ్యులతోపాటు రాంగోపాల్పేట మాజీ కార్పొరేటర్ అరుణాగౌడ్ పాల్గొన్నారు.
– బేగంపేట