దుగ్గొండి, ఏప్రిల్17: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో పల్లెప్రగతి పనులను నూరుశాతం పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించి చాపలబండ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వన నర్సరీతో పాటు అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచి పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె పార్కులో మొక్కల రక్షణకు నిత్యం నీళ్లు పోయాలని, నర్సరీలోని ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ ఎడెల్లి రజిత, ఏపీవో విద్యావతి, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, పీఎస్ హెచ్ఎం పరుపాటి సుధాకర్రెడ్డి, రజిని, రాధిక, రాజు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలి
చెన్నారావుపేట: కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఎంపీడీవో లలిత, తహసీల్దార్ పూల్సింగ్చౌహన్తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలందరూ విధిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా ఊరూరా దండోరా వేయించాలన్నారు. టీకాపై ఎలాంటి అపోహలు, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, పాజిటివ్ వచ్చిన వాళ్లు హోం ఐసొలేషన్లో ఉండేలా మానిటరింగ్ చేయాలన్నారు. అలాగే మండలంలోని సమస్యలపై ఎంపీడీవో లలితను అడిగి తెలుసుకున్నారు.
ఉన్న డంపింగ్యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పనుల్లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ధర్మాతండా, బోడమాణిక్యం తండాల్లోని నర్సరీలు, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఏపీవో అరుణ, ఈసీ కిశోర్, సర్పంచ్లు, సిబ్బంది పాల్గొన్నారు.