ఇద్దరి మృతితో దేవగిరిపట్నంలో విషాదం
ప్రేమికులని చెబుతున్న స్థానికులు
రెండు కుటుంబాల్లో తీరని శోకం
ములుగురూరల్, మార్చి23 : ఓ యువతి ఐదు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం చనిపోయింది. ఆమె మరణ వార్త తెలిసి ఓ యువకుడు మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఇద్దరి దీ ఒకే ఊరు కావడంతో గ్రామంలో విషాదం నెల కొంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ములుగు మండలం దేవగిరిపట్నానికి చెందిన నాగావత్ రవి-విజయ దంపతుల రెండో కూతురు రుక్మిణి (20), ఐదు రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధప డుతున్నది. ఆదివారం రాత్రి సమస్య తీవ్రం కావడం తో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించిన అనంతరం హన్మకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడే వైద్యం అందిస్తున్న క్రమంలో సోమవారం ఉదయం రుక్మిణి మృతి చెందిందని చెప్పారు.
హైదరాబాద్లో యువకుడి ఆత్మహత్య..
ఇదే గ్రామానికి చెందిన కేలోతు వీరన్న-లక్ష్మీ దంప తుల కొడుకు మహేందర్(22) హైదరాబాద్లోని శం షాబాద్ ఎయిర్పోర్టులో పనిచేస్తూ అక్కడే ఉంటున్నా డు. కొంతకాలంగా రుక్మిణి, మహేందర్ ప్రేమించు కుంటున్నారు. రుక్మిణి మరణవార్త తెలిసి ఆమె లేని లోకంలో ఉండలేక తీవ్ర మనస్తాపంతో మహేందర్ మంగళవారం తన రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు చనిపోవడంతో గ్రామంలో వి షాదం నెలకొంది. కాగా, మహేందర్ కూడా అనారో గ్య సమస్యతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లి దండ్రులు చెబుతున్నారు. ఇద్దరి మృతిపై ములుగు ఎస్సై హరికృష్ణను వివరాలు కోరగా తమ దృష్టికి రా లేద ని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.