అమరావతి: ఏపీ ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వాలంటీర్ల వ్యవస్థపై ఆయన ట్విటర్ వేదికగా ప్రశంసలు కురపించారు.
‘ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ. అలాంటి అనుసంధానకర్తలపై పడి ఏడవడం మానుకోవాలి. తిరుపతి ఉపఎన్నికల్లో ఓటమిని విపక్షాలు ముందే అంగీకరించాయా? లేదా ఓడిపోయాక ఆ నిందను వాలంటీర్లపై మోపాలని ఫిక్సయ్యారా?’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘పచ్చకుల బ్యాచ్ కు తానే లీక్ చేస్తాడు. మళ్లీ ఏదో జాతీయ సమస్య అన్నట్లు సీబీఐ ఎంక్వైరీ కోసం డిమాండ్. పోలీసులైతే మళ్లీ తననే ఇరికిస్తారట! ఇంటర్ పోల్, స్కాట్ లాండ్ యార్డ్ దర్యాప్తు కోరాల్సింది నిమ్మగడ్డా. నీ చెత్త లేఖలు, సీక్రెట్ మీటింగ్ లపై చైనా హ్యాకర్ల కన్నుపడిందేమో.’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.