హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టాల్సిన పనుల కోసం అదనపు కలెక్టర్లకు నిధులు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పనుల మంజూరు కోసం అదనపు కలెక్టర్లకు రూ. 25 లక్షల చొప్పున కేటాయించారు. ఆదివారం ప్రగతి భవన్లో అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సీఎం కేసీఆర్ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా అదనపు కలెక్టర్లకు కొత్త కార్లను సైతం ఆయన అందజేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్లను జెండా ఊపి ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.