హైదరాబాద్ : అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎల్.రమణ అన్నారు. శుక్రవారం గన్పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మరికాసేపట్లో తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ఎల్ రమణ తెలిపారు. అందరితో కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో పాల్పంచుకుంటానని అన్నారు.