విద్యుత్ వెలుగు జిలుగులతో సాయం సంధ్యా వేళ ట్యాంక్ బండ్ అందాలు మరింత ద్విగుణీకృతమవుతున్నాయి. అందమైన సాయంత్రాలను మరింతగా ఆస్వాదించేందుకు పర్యాటకులు హుస్సేన్సాగర్కు పోటెత్తుతున్నారు.
పిల్లగాలులతో ఆహ్లాదాన్ని పంచుతున్న ట్యాంక్ బండ్పై కుటుంబాలతో సహా కలిసి వచ్చి ఫొటోలు, సెల్ఫీలు దిగితూ సందడి చేస్తున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ఆడిపాడుతూ ఆనందడొలికల్లో మునిగితేలుతున్నారు.
విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న తథాగతుడి విగ్రహాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉస్సేన్సాగర్ ఆనందాలకు నెలవుగా మారుతున్నది.