లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి
అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం
వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు
జిల్లాల వారీగా ధాన్యం సేకరణపైనా ఆరా
ఎదులాపురం / నిర్మల్ టౌన్, జూన్ 18 : రాష్ట్రంలో అర్హత కలిగిన పేదవర్గాల వారికి రేషన్ కార్డులు అందజేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో శుక్రవారం కొత్త రేషన్ కార్డుల పంపణీ, ధాన్యం సేకరణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. రాష్ట్రంలో పేద వర్గాలకు రేషన్ కార్డు అం దించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. అన్ని జిల్లాల్లో రేషన్కార్డుల విచారణ ప్రక్రియను శనివారం నుంచే ప్రారంభించాలని తెలిపారు. బోగస్ దరఖాస్తులను గుర్తించాలని సూచించారు. ఈ నెల 8వ తేదీ వరకు 4,15,9 01 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కా ర్డులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు చేశామని తెలిపారు.
ఖాళీగా ఉన్న చౌకధరల డీలర్ల దుకాణాలను రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం మేరకు భర్తీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మా ట్లాడుతూ… జిల్లాలో ఈ నెల8వ తేదీ నాటికి 6,385 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపా రు. ఇప్పటి వరకు 3,064 దరఖాస్తులను పరిశీలించి జిల్లా పౌరసరఫరాల అధికారి లాగిన్లో ఉ న్నాయని, మిగతా దరఖాస్తులను సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2020-21 యాసంగి పంట కాలంలో 207 మంది రైతుల నుంచి 520 మెట్రి క్ టన్నుల ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించి రూ.98.24 లక్షల రైతులకు చెల్లించినట్లు వివరించారు. జిల్లాలోని చౌకధరల దుకాణాల డీలర్ల నుంచి 2,46,292 గోనె సంచులను సేకరించి నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు పంపించినట్లు తెలిపారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది రికార్డుస్థాయిలో 1.92 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చిందని మంత్రి దృష్టికి తెచ్చారు. ధాన్యం డబ్బులు కూడా అందరి ఖాతా ల్లో జమ చేశామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆదిలాబాద్, నిర్మల్ అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, హేమంత్ బోర్కడే, సీ రాంబాబు, జిల్లా పౌరసరఫరాల అధికారులు సుదర్శనం, కిరణ్కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.