న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా వైరస్ మరింత విజృంభిస్తుండటంతో స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను జూన్ చివరి వరకు ప్రకటించుకునే అవకాశం కల్పించింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మరింత సమయం ఇవ్వాలని కార్పొరేట్ సంస్థల విజ్ఞప్తి మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక సంవత్సరం ముగిసిన 60 రోజుల్లో అంటే మే 30 వరకు కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది..కానీ, సెబీ తీసుకున్న తాజా నిర్ణయంతో జూన్ చివరి వరకు ప్రకటించుకునే పెసులుబాటు లభించింది.