జిల్లా పోలీసుల పనితీరు భేష్
నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి
పెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసుల పనితీరు భేష్గా ఉందని నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. సీపీ సత్యనారాయణతో కలిసి పెద్దపల్లిలోని మెయిన్రోడ్డు, కూరగాయల మార్కెట్, రైల్వే స్టేషన్లను శుక్రవారం ఆయన సందర్శించారు. రైల్వే స్టేషన్లో ఒడిశా, ఛత్తీస్గఢ్కు వెళ్లే కార్మికులతో మాట్లాడి వారికి పండ్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడారు. పోలీసులకు సహకరించి కరోనా కట్టడిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. లాక్డౌన్ మినహాయింపు సమయాల్లో గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు. దవాఖానలు, రైల్వే స్టేషన్లలో పోలీసు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ను ఉల్లంగించిన వారిపై 34,075 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మాస్క్ సరిగ్గా ధరించకపోవడంపై 17,639, 119ఎక్సైజ్ కేసులు, 53గుట్కా కేసులు, 606భౌతిక దూరం పాటించని కేసులు, 356 గుంపులుగా ఉన్న వారిపై కేసులు, 2,334 వైలేషన్ ఆఫ్ డిసబెడియన్స్ ఆర్డర్స్ ప్రకారం, ఇతర వయోలేషన్ కేసులు 12,667 నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేకుండా రోడ్లపై తిరిగిన 4, 157వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీసీపీ రవీందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ సారంగపాణి ఉన్నారు.