కరోనా వ్యాప్తితో సంతోష్శోభన్ హీరోగా నటించిన ‘ఏక్మినీ కథ’ చిత్రం రిలీజ్ వాయిదాపడింది. కార్తిక్ రాపోలు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగ్ మాస్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకావాల్సిఉంది. కొవిడ్ మూలంగా వాయిదావేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త విడుదలతేదీని వెల్లడిస్తామన్నారు.