హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని స్పీకర్ చాంబర్లో సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుకున్నారు. స్వల్ప అనారోగ్యంతో కాస్త ఇబ్బందిపడాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంకు వివరించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సుఖేందర్ రెడ్డి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే.