హైదరాబాద్ : నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సందర్భంగా సీఎం శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మడిపల్లి భద్రయ్య సెప్టెంబర్ 18వ తేదీన మరణించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీవనంలో నిత్య సాహితీ కృషీవలుడు మడిపల్లి భద్రయ్య. కవి, గాయకులు, నటులు.. వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి భద్రయ్య. పౌరాణిక నాటకాలు, కవితలు, గీతాలతో,సాహిత్యంలో కళారంగంలో, సమాజ సేవలో ఐదు దశాబ్దాలుగా సేవలందించారు. ఈ నెల 18న హైదరాబాద్లో గుండెపోటుతో కన్నుమూశారు. 1945, జనవరిలో నిర్మల్లో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందించారు. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య కళావైభవాలను తెలుపుతూ అనేక పుస్తకాలను రచించారు.
మడిపల్లి సాహితీ సేవలో ‘మన ఆదిలా బాదు, మన భాష-మన యా స’ అనేది విశిష్టమైనది. తెలుగు దనానికి నిజమైన నిదర్శనంగా వేషంలోనూ, భాషలోనూ మన తెలంగాణ భూమి పుత్రుడు ఆయన. సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకూ ప్రతిస్పంది స్తూ.. అక్షరబద్ధం చేశారు. సమాజోద్ధరణకు నిరంతరం తపించారు. ప్రతి సంఘటననూ కవితా వస్తువుగా మలచుకొని, రాసి, పాడు తూ వాగ్గేయకారుడిగా కీర్తినొందారు.