హైదరాబాద్ : ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి శంకర్ నాయక్ (74) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శంకర్ నాయక్ మృతిపట్ల మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్తో పాటు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. శంకర్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.