దిలావర్పూర్, జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్యాకేజీ 27 పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. ఈ ప్యాకేజీలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ మరో రూ.290 కోట్లు మంజూరుచేశారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.