కరీంనగర్: సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అలుగునూర్లో టీఆర్ఎస్ కార్మిక నేత రూప్సింగ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ కరీంనగర్ చేరుకుంటారు. దళితబంధు పథకం అమలుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దళితబంధు పథకంలో భాగంగా హుజూరాబాద్లోని 20,929 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిచనున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ పథకానికి నిధుల కేటాయింపు కూడా జరిగిన విషయం తెలిసిందే. దళితబంధు నిధులు రూ.2 వేల కోట్లు ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. ఈ నేపథ్యంలో దళితబంధుపై సీఎం కేసీఆర్ కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరుకానున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరిగి వస్తారు.