హన్మకొండ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడు ప్రతీక్, హర్షిణి వివాహం గురువారం జరిగింది. హన్మకొండ భీమారం ఎస్వీఎస్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.