Telangana
- Jan 07, 2021 , 01:39:12
సింగరేణి అధికారులకు 111 కోట్లు

- పీఆర్పీ చెల్లింపునకు సీఎం కేసీఆర్ నిర్ణయం
గోదావరిఖని, జనవరి 6: సింగరేణి అధికారులకు కొత్త ఏడాదిలో సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. సంస్థలో పనిచేస్తున్న 2500 మంది అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) చెల్లించాలని నిర్ణయించారు. 2018-19కి సంబంధించి బకాయిగా ఉన్న రూ.111 కోట్లను చెల్లించేందుకు అంగీకరించారు. ఈ మొత్తాన్ని ఫిబ్రవరి నెలలో చెల్లించనున్నారు. దీనివల్ల జూనియర్ అధికారులకు రూ.లక్ష వరకు పీఆర్పీ వస్తుంది. సీనియర్ అధికారులకు రూ.5 లక్షల వరకు రానున్నది. పీఆర్పీ చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తంచేశారు. కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జక్కం రమేశ్, ఎన్వీ రాజశేఖర్రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
- అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు షురూ..
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్రౌండర్కు రూ.10కోట్లు చెల్లిస్తారు!
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్..
- అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!
MOST READ
TRENDING