హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో సిద్ధమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను (డయాగ్నస్టిక్ సెంటర్లను) సోమవారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఒక్కో డయాగ్నస్టిక్ కేంద్రంలో 57 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. మహబూబ్నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగామ, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. శనివారం వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశంలో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలతోపాటు పలు అంశాలపై చర్చించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వైద్యాధికారులు తెలుపగా.. వాటిని సోమవారం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మెరుగు
రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామని చెప్పారు. ప్రజలకు ఉచిత వైద్యంకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నదని తెలిపారు. ఉమ్మడిరాష్ట్రంలో ఆగమైన వైద్యరంగాన్ని అనతికాలంలోనే ప్రభుత్వం పునరుజ్జీవింపచేసిందని వివరించారు. సామాన్యుడికి వైద్యా న్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం, ఆ దిశగా మరో ముందడుగు వేస్తున్నదని చెప్పారు. వైద్యచికిత్సలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను (డయాగ్నస్టిక్ సెంటర్స్) 19 జిల్లాల్లో ఏర్పాటుచేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని, ప్రభు త్వ వైద్యరంగంలో విప్లవాత్మకమని అన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో సమన్వయం చేసుకుని నియోజకవర్గాల్లోని మెరుగైన వైద్యం అందేలా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వంటి ఆపతాలంలో ప్రభుత్వం వినియోగంలోకి తెస్తున్న డయాగ్నస్టిక్ సేవలు ప్రజలకెంతో మేలు చేస్తాయని, ఈ పథకానికి త్వరలో మంచి పేరు పెడుతామని తెలిపారు.
డయాగ్నస్టిక్ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు
ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా పరీక్షలతోపాటు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్, గుండె జబ్బులు, బొకల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీకి సంబంధించిన పలు పరీక్షలు ఉంటాయని తెలిపారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి వెంటనే రిపోర్టు ఇస్తారని సీఎం తెలిపారు. నిర్ధారించిన రిపోర్టులను రోగుల సెల్ఫోన్లకు మెసేజ్ల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభు త్వం చేసిందని చెప్పారు. డయాగ్నస్టిక్ కేంద్రాల్లో పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న యం త్రాలన్నీ అత్యంత అధునిక సాంకేతికతతో, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో కోట్ల రూపాయల ఖరీదైనవని తెలిపారు. ఇటువంటి పరీక్షా యంత్రాలు పెద్దపెద్ద కార్పొరేట్ దవాఖానాల్లో, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ దవాఖానాలల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా వీటిని ఏర్పాటు చేసిందని తెలిపారు.
అత్యాధునిక సాంకేతికత యంత్రాలు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఫుల్లీ ఆటోమెటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమెటిక్ ఇమ్యునోఅస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్కౌంటర్, ఎలీసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమెటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక సాంకేతికతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలున్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. వీటితో పాటుగా ఈసీజీ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలను కూడా ఏర్పాటుచేశామని తెలిపారు. ఇవి అత్యంత సామర్థ్యంతో కూడుకుని, వేగంగా రిపోర్టులు ఇస్తాయని, పరీక్షల తీరును అనుసరించి ఒకో యంత్రం గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత కచ్చితత్వంతో అందజేస్తుందని వైద్యాధికారులు తెలిపారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటుచేసిన అత్యాధునిక యంత్రాల ద్వారా తకువ సమయంలో ఎకువ మంది పేదలకు రోగ నిర్ధారణ చేసి, వైద్య సేవలందించగలుగుతామని చెప్పారు. వీటితోపాటు, అందుబాటులో లేనిచోట్ల సీటీ సానింగ్ యంత్రాలను కూడా దశలవారీగా ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఈ పరీక్షా కేంద్రా ల్లో అవసరమైన మేరకు పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, రేడియాలజిస్టులు సహా ఇతర సాంకేతిక సిబ్బందిని ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు.
పీహెచ్సీలోనూ శాంపిల్స్ సేకరణ
పరీక్షా కేంద్రానికి వెళ్లలేని వ్యక్తి నుంచి శాంపిల్ తీసుకొని ప్రభుత్వమే దగ్గరలోని కేంద్రానికి పంపి సత్వరం రిపోర్టు వచ్చేలా చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో చికిత్స చేయించుకున్న రోగికి స్వయంగా ఈ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితులుంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటువంటి సందర్భంలో సంబంధిత వైద్యుడి సిఫారసు మేరకు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్ను ప్రభుత్వమే దగ్గరలోని కేంద్రానికి పంపి పరీక్షలు నిర్వహించి సత్వరమే రిపోర్టులు ఇచ్చేలా ఏర్పాట్లుచేసిందని తెలిపారు.
ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వైద్యసేవలు
‘వైద్య అవసరాల కోసం నాలుగు రకాల ఖర్చులుంటయి. దవాఖానకు పోవడానికి రవాణా ఖర్చు. పోయినంక డాక్టర్ ఫీజు, మందులు, పరీక్షల ఖర్చు, ఇన్పేషెంట్గా చేరాలంటే వైద్యసేవల ఖర్చు. రోగం నయమైనంక తిరిగి ఇంటికి పోవాలంటే రవాణా ఖర్చు. ఒకవేళ చనిపోతే పార్థివ దేహాన్ని తరలించడానికి అదో ఖర్చు, ఇలా ఇన్ని తీర్ల ఖర్చులుంటయి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఈ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తూ సర్కారు దవాఖానల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నదని తెలిపారు. అత్యవసర సమయాల్లో దవాఖానకు తీసుకుపోవడానికి 428 అంబులెన్సు వాహనాలను నిరంతరం నడుపుతున్నట్టు వివరించారు. బాలింతలు, తల్లీబిడ్డల రక్షణ, రవాణా కోసం అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే 300 వాహనాలను ఏర్పాటుచేసి వైద్యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. బాలింతలను దవాఖానలో చేర్చడం నుంచి ప్రసవానంతరం తల్లీబిడ్డలను తిరిగి ఇంటివద్దకు సురక్షితంగా చేర్చే వరకు అమ్మ ఒడి వాహనాలు అందుబాటులో ఉన్నాయని సీఎం వివరించారు.
చికిత్స కంటే పరీక్షల ఖరీదు ఎక్కువైంది
‘ప్రజలకు వైద్యం రానురాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. పేదలకు జబ్బుచేస్తే నయం చేసుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. రోగం చికిత్స కంటే రోగపరీక్షల ఖరీదు మరీ ఎకువైంది. రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం, మూత్రం వంటి పరీక్షలు చేయాల్సిందే. ఈ నడుమ ప్రతి మనిషికి బీపీలు, షుగర్లు ఎకువైనయి. వాటి పరీక్ష చేయించుకోవాలి. గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సరు, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు సామాన్యులకు, పేదలకు అవసరంగా మారాయి. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరింది. దానికీ పలురకాల పరీక్షలు ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తడు, కానీ పరీక్ష కోసం ఎకడికో ప్రైవేట్ సెంటర్లకు పోయి వేలకువేలు ఖర్చుచేసి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తున్నది. దీనివల్ల పేదలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నది. కరోనా నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు, చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షల కోసం పేదలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యాన్ని అందించడమంటే కేవలం డాక్టర్లు, మందులు, సూదులు మాత్రమే కాదనీ, పరీక్షలు కూడా అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంకా అవసరమైన చోట్ల దశలవారీగా ఏర్పాటు చేస్తాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ముఖ్యమైన యంత్రాల్లో కొన్ని..
ఫుల్లీ ఆటోమెటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమెటిక్ ఇమ్యునోఅస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్కౌంటర్, ఎలీసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమెటిక్ యూరిన్ అనలైజర్. ఈసీజీ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలు.
వైద్య అవసరాల కోసం దవాఖానకు పోవడానికి రవాణా ఖర్చు. పోయినంక డాక్టర్ ఫీజు, మందులు, పరీక్షల ఖర్చు, ఇన్పేషెంట్గా చేరాలంటే వైద్యసేవల ఖర్చు. రోగం నయమైనంక తిరిగి ఇంటికి పోవాలంటే రవాణా ఖర్చు. ఒకవేళ చనిపోతే పార్థివదేహాన్ని తరలించడానికి అదో ఖర్చు. ఈ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నది.
ప్రజలకు వైద్యం అత్యంత ఖరీదైనదిగా మారింది. పేదలకు జబ్బుచేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి. రోగం కంటే రోగపరీక్షల ఖరీదు మరీ ఎకువైంది. ఈ నడుమ ప్రతి ఒక్కరికి బీపీలు, షుగర్లు ఎకువైనయి. గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సర్, థైరాయిడ్ తదితర జబ్బులకు పరీక్షలు అవసరంగా మారాయి. ఈ మధ్యలో కరోనా వచ్చిచేరింది. ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తడు, కానీ పరీక్ష కోసం ప్రైవేట్ సెంటర్లకు పోయి వేలకువేలు ఖర్చుచేయాల్సి వస్తున్నది. దీనివల్ల పేదలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నది. ఆ బాధలు తప్పించేందుకే డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు.