మియాపూర్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తున్నదని, అత్యవసర సమయాల్లో భరోసాను నింపుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు నిరంతర కృషిని కొనసాగిస్తున్నదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన 9 మంది లబ్ధిదారు లకు సీఎం సహాయ నిథి ద్వారా మంజూరైన రూ. 4,29,500ల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ బుధవారం వివేకానందనగర్లోని తన నివాసంలో వారికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు వారి ఆరోగ్యాలను స్వస్థత చేకూర్చుకునేందుకు సీఎం సహాయ నిధి పథకం ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. సీఎం సహాయనిధి ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా వందలాది మంది పేదలకు కొండంత అండగా నిలిచిందని, ఇంకా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి వీలైనంత త్వరగా సహాయం అందేలా తాను అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు విప్ ఆరెకపూడి గాంధీ వెల్లడించారు. నియోజకవర్గ పేద ప్రజలకు ఎల్లపుడూ తన అండదండలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, పార్టీ నేతలు పోతుల రాజేందర్, శ్రీనివాస్దరి, ఎల్లం నాయుడు, తిరుపతి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.