నిజామాబాద్ : ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో క్రమంగా తగ్గిపోవడంతో ఎస్సారెస్పీ గేట్లను గురువారం మూసి వేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6,720 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1090.7 అడుగుల (88.662 టీఎంసీలు) నిల్వ ఉంది. జెన్కోకు 2,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే రోజున 1089.80 అడుగుల (83.772 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నట్లు ఈఈ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Adilabad : ఎంపీ సోయం బాపురావ్పై కేసు
సరిహద్దు సమీపంలో.. రెండు పాక్ ఎయిర్బేస్లు
టాస్ గెలిచిన జో రూట్.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్