కొత్తూరు రూరల్, ఏప్రిల్ 2: పాత జాతీయ రహదారి మరమ్మతులను త్వరగా ప్రారంభించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తూరు వై జంక్షన్ నుంచి షాద్నగర్ మీదుగా సోలిపూర్ వరకు పాత జాతీయ రహదారి గుంతలమయంగా మారిందన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్డు పనులకు ఇప్పటికే రూ.62 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయినా మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసం ముందస్తుగా సాధారణ మరమ్మతుల కోసం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద రూ.2.95కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో బ్రిడ్జ్ల నిర్మాణం, ప్యాచ్ వర్క్ పనులను త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్ గోపాల్రెడ్డికి ఫోన్ చేసి సూచించారు. కరోనా లాక్డౌన్ వల్ల పాతజాతీయ రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయని, త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, చేగూరు సర్పంచ్ సంతోషవిఠల్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్, వైస్చైర్మన్ పద్మారావు, సింగిల్విండో డైరెక్టర్ సాయిలు, మాజీ సర్పంచ్లు శ్రీను, జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవేందర్యాదవ్, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ యాదగిరి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కృష్ణయాదవ్, సత్యనారాయణ, సదానందంగౌడ్, రాఘవేందర్యాదవ్, మాధవరెడ్డి, నాగరాజుగౌడ్, మహేందర్రెడ్డి, సుఖేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
హెచ్డీఎఫ్సీ ఎఫ్డీ వడ్డీ పెంపు
23న భారత్ విపణిలోకి ‘ఎంఐ 11 అల్ట్రా’.. ధరెంతంటే?!
లాజిస్టిక్ హబ్గా హైదరాబాద్!
రెండు గంటల్లో ‘బిగ్ బజార్’ సరుకుల హోం డెలివరీ!
షాకింగ్: ఆండ్రాయిడ్ యూజర్ల డేటా.. గూగుల్ షేరింగ్!
ఒక్కరోజే పెరిగిన బంగారం ధర.. ఎంతంటే!