షర్మిల తాకినందుకు నిరసనగా క్షీరాభిషేకం
దేవరుప్పుల, సెప్టెంబర్ 12: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని తాకే అర్హత వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిలకు లేదని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆమె సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి వెళ్తూ గొల్లపల్లిలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేయడాన్ని తప్పుపట్టారు. ఆమె వెళ్లిన వెంటనే శ్రీకాంతాచారి విగ్రహాన్ని పాలతో కడిగారు. పురోహితులతో విగ్రహానికి సంప్రోక్షణ చేయించారు.