నిర్మల్ : జిల్లాలోని భైంసా బట్టిగళ్లీప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో ముగ్గురు పోలీసులకు సైతం గాయపడ్డారు. దుండగులు ఓ ఆటోకు, ఇంటికి నిప్పుపెట్టడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో బట్టిగళ్లీ ప్రాంతానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.