మానవపాడు, మే 15: ఇంటి వద్ద వాహన పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలులోని సంతోష్నగర్ కాలనీలో చోటుచేసుకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్బీలో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ముని మహేశ్వర్రెడ్డి సంతోష్నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఇంటి వద్ద కారు నిలిపే విషయంలో పొరుగు వారితో శుక్రవారం మధ్యాహ్నం ఘర్షణ జరిగింది. అందరూ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. మహేశ్వర్రెడ్డితో గొడవపడిన వ్యక్తి రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ తన అనుచరులతో వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో మహేశ్వర్రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఘటనపై కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.