ప్రధానికి చినజీయర్స్వామి ఆహ్వానం
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్లోని దివ్యసాకేతంలో ఏర్పాటుచేసిన 216 అడుగుల సమతామూర్తి (రామానుజాచార్య) పంచలోహ విగ్రహావిష్కరణకు హాజరుకావాలని ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని శనివారం చినజీయర్స్వామి కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రామానుజాచార్య జీవిత విశేషాలు, ఆయన మహత్కార్యాలతోపాటు ముచ్చింతల్లోని రామానుజప్రాజెక్టు విశేషాలను ప్రధానికి వివరించారు. మైహోమ్ గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రావు కూడా చినజీయర్స్వామి వెంట ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండు నుంచి 14 వరకు జరిగే భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నారు. చినజీయర్స్వామి చేస్తున్న ప్రయత్నాలను అభినందించిన ప్రధాని మోదీ, విగ్రహావిష్కరణకు తప్పకవస్తానని హామీఇచ్చారు. గత ఐదురోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న చినజీయర్స్వామి ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్రమంత్రులు అమిత్షా, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ తదితరులను కలిసి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.