పాల్వంచ రూరల్ /భద్రాద్రి కొత్తగూడెం : ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎంపీడీవో ఆల్బర్ట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఆడేపు రామలింగయ్య అనే కాంట్రాక్టర్ స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ పనులు చేస్తున్నాడు.
కాగా, చెక్పై సంతకం పెట్టేందుకు ఎంపీడీవో ఆల్బర్ట్ రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రూ.20వేలు ఎంపీడీవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో వరంగల్కు చెందిన ఏసీబీ అధికారి మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్