హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువులపై విద్యాశాఖకు బాలల హక్కుల రక్షణ కమిషన్ పలు సూచనలు చేసింది. విద్యాశాఖ కార్యదర్శికి బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు శుక్రవారం లేఖ రాశారు. కరోనా దృష్ట్యా డ్రాపవుట్లు, బాల్య వివాహాలు పెరిగే అవకాశం ఉన్న కారణంగా గ్రామీణ విద్యార్థులకు పాఠాల బోధనకు టీవీ మాధ్యమం వాడాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థుల ఇంటికే పౌష్టికాహారం పంపేలా ప్రణాళిక చేయాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు, పనితీరును నియంత్రించేలా చూడాలని పేర్కొన్నారు.