హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఛత్తీస్గఢ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ చరణ్దాస్ మహంత శుక్రవారం సందర్శించారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన ఆయన తెలంగాణ అసెంబ్లీని సందర్శించగా, రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి స్వాగతం పలికారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం శాసనసభ సమావేశ మందిరాన్ని మహంతకు స్పీకర్ పోచారం చూపించారు. స్పీకర్ పోచారం వెంట కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తదితరులున్నారు.