శిల్ప సంపదకు కెమికల్ ట్రీట్మెంట్
ఖిలా వరంగల్, ఆగస్టు 29 : ఓరుగల్లు కోటలోని కాకతీయుల శిల్ప సంపదకు మహర్దశ వచ్చింది. ప్రపంచ ఖ్యాతిగాంచిన కీర్తి తోరణాలు వాటి మధ్యనున్న కాకతీయుల అద్భుత శిల్పాలు కొత్త మెరుపు సంతరించుకోనున్నాయి. కోటలోని చారిత్రక కట్టడాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకొని, పలు శిల్పాలు తెల్లరంగులోకి మారాయి. ఈ నేపథ్యంలో శిల్ప సంపదకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర పురావస్తుశాఖ నడుం బిగించింది. రెండేండ్ల క్రితం ఖుష్మహల్కు విజయవంతంగా కెమికల్ ట్రీట్మెంట్ చేశారు. అదే తరహాలో ఇప్పుడు కీర్తితోరణాల మధ్యనున్న ప్రతీ శిల్పానికి కెమికల్ ట్రీట్మెంట్ చేపట్టారు. శిల్పాలను శుభ్రం చేసే పనులను వేగవంతం చేశారు.