సుల్తాన్బజార్,జూన్ 5: తెలంగాణ రాష్ర్టా న్ని హరిత తెలంగాణగా మార్చడానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఎంతో మహోత్తమమైనదని నగర సీపీ అం జనీ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహాల్ పోలీస్స్టేడియంలో రైడర్ జోష్ ఫౌండేషన్, ఎస్ఎస్ గోల్డ్ టీఎంటీల సంయుక్తాధ్వర్యంలో గ్రీన్ ఇం డియా చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీపీ.. నగర అదనపు సీపీ శిఖా గోయెల్, జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్తో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏసీపీ నరేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు అజయ్ కుమార్, రణవీర్ రెడ్డి, రైడర్ జోష్ ఫౌండేషన్ జోషువా డానియల్, ఎస్ఎస్ గోల్డ్ టీఎంటీ సంస్థ డైరెక్టర్లు టంకరి శ్రీహరి, టంకరి శ్రీధర్, శెనిశెట్టి శివకుమార్, రాకేశ్, విజయ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.