మెదక్ : జిల్లాలోని నార్సింగ్ మండల కేంద్ర శివారులో చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని గుండు చెరువు వెనుక చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు అక్కడి చేరుకొని పాదముద్రలు సేకరించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువుల కాపర్లు, జీవాల పెంపకందారులు చెరువు పరిసరాల్లోకి వెళ్లవద్దని చెప్పారు. నీరు తాగేందుకు చిరుత చెరువు వద్దకు వచ్చి ఉంటుందని భావిసున్నారు. చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ పొలం వద్దకు వెళ్లే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.