హైదరాబాద్, ఆగస్ట్ 19(నమస్తే తెలంగాణ): చిరుధాన్యాల(మిల్లెట్స్)ను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఇక్రిశాట్ అధ్యయనంలో తేలింది. చిరుధాన్యాలపై జరిగిన సుమారు 19 పరిశోధనల ఫలితాలను క్రోడీకరించి ఇక్రిశాట్ సీనియర్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ అనిత నేతృత్వంలోని బృందం విశ్లేషించింది. ‘మిల్లెట్స్తో కొలెస్ట్రాల్ 8% తగ్గింది. రక్తపోటు 5% తగ్గింది. అధిక బరువు ఉన్నవారి బీఎంఐ సాధారణ స్థాయికి చేరింది’ అని అధ్యయన నివేదిక వెల్లడించింది. అయితే 21 రోజుల నుంచి కనీసం మూడు నెలల పాటు రోజుకు 50 నుంచి 200 గ్రాముల చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్నప్పుడే ఈ ఫలితాలుంటాయి.