ఖలీల్వాడి, ఏప్రిల్ 10: తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ శాక్త పరిషత్ చతుర్వేద సదస్సు అథర్వణ వేదయాగం శనివారంతో ముగిసింది. నిజామాబాద్లోని ఉమామహేశ్వర ఆలయంలో లోక కల్యాణార్థం మూడు రోజులుగా చతుర్వేద సదస్సు, అథర్వణ వేదయాగం నిర్వహించారు. ఉదయం 11:45 గంటలకు అథర్వణ మహాయాగ పూర్ణాహుతి, అవభృతము చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారికి మహారుద్రాభిషేకం, బ్రహ్మశ్రీ వంశీకృష్ణ ఘనాపాఠి (దత్త పీఠ విద్వాంసులు, వేద విజ్ఞాన విష్ణాటం చతుర్వేద విద్యాలయ సంస్థాపకులు మైసూర్) వేద సభను ప్రారంభించారు. అనంతరం చతుర్వేద పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో శాస్త్ర పరిషత్ తెలంగాణ అధ్యక్షుడు రాధాకృష్ణశర్మ, జిల్లా అధ్యక్షుడు పవన్శర్మ, పశుపతిశర్మ, రామకృష్ణశర్మ, కృష్ణప్రసాద్శర్మ, ఉమామహేశ్వరశర్మ, అజయ్ సంగ్వాయ్, శ్రీ భాష్యం కృష్ణ ప్రసాద్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, ప్రశాంత్ జోషి, భక్తులు పాల్గొన్నారు.