జయశంకర్ భూపాలపల్లి : భీంపూర్ రిజర్వాయర్ కట్ట, మత్తడి ని పటిష్టం చేయాలని జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి అన్నారు. ఇరిగేషన్ అధికారులు, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారంలోని భీమ్ గణపురం చెరువు, పంప్ హౌస్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ..భీం ఘణపూర్ చెరువు నుంచి భూపాలపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలనే లక్ష్యంతో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించడానికి నిధులు మంజారు చేశామన్నారు.
కానీ కరోనా మహమ్మారి వల్ల పనులు కొంత జాప్యం జరిగాయన్నారు. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పనుల కొనసాగింపుపై కొన్ని మార్పులను చేస్తూ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. దాదాపు 5000 ఎకరాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు.
ఈ స్కీం మొత్తం పూర్తి అయితే అటవీ ప్రాంతం లోని దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరు చెరువులు, కుంటల ద్వారా అందించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, సెగ్గెం సిద్దు, ఎంపీపీ లావణ్య, మండల పార్టీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్ రాజేష్ నాయక్, యూత్ ప్రెసిడెంట్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి