హైదరాబాద్ : న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్యలపై సుమోటో, ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ ముగించింది. గత నెల 19న విచారణను పూర్తి అయ్యిందని, పోలీసులు మంథనిలోని ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. న్యాయవాదుల జంట హత్య కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందని, మంథనిలోని చార్జిషీట్ కరీంనగర్ జిల్లా స్పెషల్ కోర్టుకు బదిలీ అవుతుందని తెలిపారు.
ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు పిల్పై తదుపరి విచారణ అవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్లోని ప్రత్యేక కోర్టులో ఈ నెల 10 నుంచి విచారణ ప్రారంభం అవుతుందని ఏజీ చెప్పారు. పోలీసుల దర్యాప్తు తీరును గతంలో కూడా హైకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది.