మహబూబ్నగర్ : దళితబంధు పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలాన్ని ఎంపిక చేయడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, రాదన్న తెలంగాణను సాధించిన కేసీఆర్, వీలు కాదన్న దళితబంధు పథకాన్ని అమలుచేసి చూపిస్తారని అన్నారు.
తెలంగాణ సాధిస్తామన్నప్పుడు అనుమానం వ్యక్తం చేసిన వారే తెలంగాణ అభివృద్ధిని అనుమానించారని, తెలంగాణ అభివృద్ధిని అనుమానించిన వారే దళితబంధు అమలు గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినట్లే దళితబంధు విజయవంతం అవుతుందని అన్నారు.